Saturday 17 September 2016

ఎవరు నేర్పారు?

తేనెటీగ జాతికి చెందిన ఒక ‘కందిరీగ’ ఉంది.


అది జీవితం లో ఒక సారి మాత్రమే గ్రుడ్లను పెట్టి చనిపోతుంది. తన బిడ్డలని తనెప్పుడు చూడదు. కానీ పుట్టబోయే బిడ్డలకు ముందుగానే ఆహారాన్ని సమకూరుస్తుంది. 
అది గడ్డి పురుగు (grass hopper) ని సంపాదించి దాన్ని వశం చేసుకుని సరిగ్గా ఎక్కడ కుట్టాలో అక్కడ కుడుతుంది.
 దాంతో ఆ పురుగు అచేతనం (unconscious) అవుతుంది. కానీ చావదు. బద్రపరచబడిన మాంసం రూపంలో అది బతుకుతుంది. 
ఆ కందిరీగ ఆ గడ్డి పురుగుని ఒక మట్టి అరలోకి తీసుకుపోతుంది. అక్కడ పురుగునకు తగినంత దగ్గరలో తన గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్లను పెట్టి అది ఎగిరిపోయి చనిపోతుంది. తన పిల్లలను ఎప్పుడు చూడలేదు. :(
గ్రుడ్ల నుండి పిల్లలు బయటకి వచ్చినపుడు అవి దగ్గరలో ఆ 'అచేతనమయిన' పురుగును కొద్ది కొద్దిగా కోరుక్కుని తింటూ ఏదుగుతాయి. కానీ చంపవు. వాటికి చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపాయకారం.
తల్లి ఈగ తన గ్రుడ్ల నుండి రాబోయే పిల్లలకు ఆహారాన్ని సమకూర్చి ఎగిరి పోయి చనిపోవటం అనే ప్రక్రియ సృష్టి ఆరంభం నుండి జరుగుతూ ఉండి ఉండాలి. ఈ విధానాన్ని అది ఎక్కడో చూసి నేర్చుకొన్నదనటానికి అవకాశం లేదు.
'సృష్టికర్తే' దానికి బోదించి ఉండాలి.
(ఈ విషయం 1960 లో ప్రచురితమయిన Readers Digest, పత్రికలో ‘భగవంతుడు ఉన్నాడు అని విజ్ఞాన శాస్త్రవేత్తలు నమ్మటానికి ఏడు కారణాలు’ అనే వ్యాసం లోనిది.)
Good Morning.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...