Wednesday 27 December 2017

వెండి పట్టీలు

మరియమ్మ - చౌడమ్మ.


క్రిస్టమస్ కి ఇంటికి వచ్చిన మరియమ్మ ని కలిశాను.
ఫుల్ గా అలక మీద ఉంది. 
..
నేను స్కూల్ కి పోను. అమ్మ ఒక డ్రెస్సె కొనిచ్చింది. "
నాకు నవ్వొచ్చింది. ఇంకా బాల్యం వీడలేదు.
"ఇంకేం కావాలి?"
చాలా సేపు మాట్లాడాక అడిగాను.
"ఇంకో డ్రెస్. ఇంకా..వెండి పట్టీలు..సన్నవి"
"అమ్మ చేత డ్రెస్ కొనిపించుకుని రేపు స్కూల్ కి వెళ్ళు.
బాగా చదువుకొని నా అంత లావుగా కావాలి.
జనవరి ఫస్ట్ కి ఇంటికి వచ్చినప్పుడు వెండి పట్టీలు రెడీ గా ఉంటాయి"
"ని జం గా నా?"
"నిజంగా😊"

Monday 25 December 2017

శారదా దేవి.


రామకృష్ణ పరమహంస శరీరం విడిచారు.
ఆయన బార్య అనేక సంవత్సరాలు గా వస్తున్న ఆనవాయితిని వ్యతిరేకించింది.
శిరోముండనం చేయించుకోలేదు. శ్వేతవస్త్రం ధరించలేదు. కంట నీరు కార్చలేదు.
ఆయన శరీరాన్ని శ్మశానం కి తీసుకెళ్ళాక, రోజు మాదిరిగానే ఆయనకి వంట చేసింది.
ఎప్పటి లాగే ఆయన కూర్చుని బోజనం చేసే బల్ల పక్క కూర్చుని విసనకర్రతో గాలి విసురుతు బోజనం వడ్డించింది.
సాయంత్రానికి పడక ఏర్పాటు చేసింది. చుట్టూ తెరలు కట్టింది. అంతా యధావిది గా ఉంది.
ఆమెకి పిచ్చి పట్టినట్లు శిష్యులు నిర్ధారణ చేసుకున్నారు.
“ఆయన చనిపోలేదు. కనీసం నావరకు. ఆయన భౌతిక శరీరం తో నాకు పనిలేదు. ఆయన సాన్నిద్యం, పరిమళం నాకు యధార్ధం. అవి నాతోనే ఉన్నాయి అవి ఉన్నంతవరకు గాజులు పగలగొట్టను. కురులు తీయను. ఆచారాలు పాటించను. ఆయన నాకు సజీవుడే” అనేది.
ఆయన మరణానతరం చాలా కాలం జీవించింది. ప్రతి రోజు రెండు సార్లు శుచిగా వంట చేసేది. బర్త తో కబుర్లు చెప్పేది. ఆయనకి సేవలు చేసేది. శిష్యులతో మాట్లాడేది. సందేహ నివృత్తి చేసేది.
హృదయం ఉన్న కొంత మంది ఆమె కి పిచ్చి లేదని అర్ధం చేసుకున్నారు. ఆమె చక్కటి సలహాలు, బోధనలు చేస్తూండేది.
ఆమె ఒక్కతే చిరకాల జీవన సహచరి. ఆయన దేహాన్ని కాకుండా మనసుని అంగీకరించినది. ఆమె చివరి శ్వాస వరకు ఆమె అలానే ప్రవర్తించింది.
ఒక రోజు ఆమె కి వేళ అయ్యింది.
అప్పుడామే రోదించడం మొదలయ్యింది.
పరమ హంస చనిపోయినప్పుడు దుఃఖించని ఆమె తీవ్ర దుఃఖం తో కదిలి పోయింది.
“ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఆయన సేవలు ఎవరు చేస్తారు?”
నిశబ్దాన్ని చేరుకునే పద్దతి అది.
ఎదురుచూసే హృదయ రీతి అది.
మరణం ఎలాటి ఆటంకాన్ని, దూరాన్ని కలిగించలేదు.

క్రిష్టమస్ తాత

వృత్తి జీవితం లో కొన్ని శిఖరాలు ఉంటాయి. శిఖరాలు అంటే కేవలం అవార్డులు, ప్రమోషన్లు మాత్రమే కాదు.
ఒక విడో. చెప్పుకోలేని అనారోగ్యం.
ఒకటే కుమార్తె. ప్రభుత్వం ఇచ్చిన చిన్న స్థలం లో ఒక పూరిల్లు.
వారం లో నాలుగు రోజులు కూలి పని. ..
మూడు రోజులు ప్రభుత్వ దవాఖానా మందులు.
ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేకుండా ఒక కేంద్ర ప్రభుత్వ పదకం లో ఒక ఇల్లు మంజూరు.
2011 జనాబా లెక్కల్లో పూరి పాకగా నమోదు కారణం గా..
ఇల్లయితే మంజురయింది కాని. కట్టుకోటానికి కనీస పెట్టుబడి లేదు..
కట్టుకునే ఓపికా లేదు.
ఒక అటో డ్రైవర్ ఆమె ఆరోగ్యంగా ఉన్నంతవరకు .. తోడుగా ఉన్నాడు.
ఆమె కి భవిషత్తు మీద ఒక నమ్మకం.
పిల్లని నవోదయా స్కూల్ లో చదివిస్తూ ఉంది.
చలికి, వానకి ఎవరు ఆమెని తమ పంచలో తలదాచుకోనివ్వరు.
సాకులు అనేకం.
కధ లో మలుపు ఏమిటంటే,,
ఆ లభ్దిదారురాలు నా జ్యురిడిక్షన్బ్ లోకి వస్తుంది. 
బ్యాంకు బుక్, మట్టిపని కార్డు, లాటివి జెనరేట్ చేయించి ఆన్లైన్ లో ఎలిజిబుల్ చేసి ఉంచాను. స్థానిక పరిచయాలు, పలుకుబడులు వాడి ఇల్లు గోడల వరకు కట్టించాను. ఇక నావల్ల అవలేదు.
ఇంటి మొత్తానికి సరిపడే డబ్బు ప్రభుత్వం ఇవ్వదు. అప్పటికే పద్దెనిమిది వేలు ఖర్చు చేసి ఉన్నాను.
ఒక వారం క్రితం ఆ గ్రామం వెళ్లి ఆమెతో మాట్లాడి ఇంటి కప్పు వేసుకొమ్మని చెప్పాను. ఆమె నవ్విందో లేదో కాని అసహాయత ని చూడటం నా వల్ల కాలేదు.
ఆమెకి కప్పు వేస్తే ముపై వేల రూపాయలు బిల్లు చెయ్యగలను.
ఆ డబ్బులు దేనికి సరిపోవు.
అవి కుడా ఇల్లు పూర్తి అయ్యాక విడుదల అవుతాయి.
కొన్ని చిన్న సంఘటనలు డ్రమెటిక్ గా ఉంటాయి.
నేను అక్కడ ఉన్నప్పుడే ఆమె కుమార్తె (8వ తరగతి) స్కూల్ నుండి ఫోన్ చేసింది. “చలికి ఎలా ఉన్నావు. స్కూల్ లో పడుకోరాదు. అంటూ.. తల్లిని పరమర్సించింది.
" క్రిస్టమస్ సెలవులకి తీసుకెళ్ళు అమ్మా అని అడిగింది”
“క్రిస్టమస్ కి వచ్చి నువ్వు నాతో పాటు చలిలో చావటం ఎందుకు. అక్కడే ఉండు” అని తల్లి చెబుతుంది.
అప్పుడా అమ్మాయి. “ అమ్మా క్రిస్టమస్ తాత వచ్చి మన ఇంటి కప్పు వేస్తే బావుంటుంది కదా?” ఆశగా అడిగింది.
చైనా ఫోన్ లో పెద్దగా వినబడుతుంది ఆ సంభాషణ.
నేను మా వర్క్ ఇన్స్పెక్టర్ బాలు నాయక్ అక్కడినుండి బయలు దేరాం.
**
ఇరవయ్యవ తేది న హైదరాబాదు లో ఉన్నప్పుడు,
మా బాలు నాయక్ ఆమె ఇంటి వద్ద నుండి ఫోన్ చేసాడు.
“సర్ చౌడమ్మ స్లాబ్ అయిపొయింది. మీరు ఇచ్చిన యాబై వేలలో ఆరున్నర వెయ్యి మిగిలాయి”

“ఒకే, సిమెంటు, ఇనుము సరిపోయిందా?”
“ఆరు 8mm సువ్వలు, నాలుగున్నర కట్ట సిమెంటు మిగిలింది. కంకర అర ట్రక్ ఉంది “
“వర్కర్స్ కి బోజనాలు ఎలా చేసావ్? “
“హోటల్ లో వండించాను. 1400 వందల్లో అయిపొయింది.’
“గుడ్ .. వచ్చాక మాట్లాడుకుందాం”
***
ఈ రోజు ఆ ఉరు వెళ్ళాను. బాలు నాయక్ ని వెంటబెట్టుకుని.
ఒక పీపా లో స్టోర్ చేసుకున్న నీళ్ళ తో స్లాబ్ తడుపుతూ ఉంది.
చౌడమ్మ చైనా ఫోన్ లో కూతురికి ఫోన్ చేసి మాట్లాడింది.
“క్రిస్టమస్ తాత వచ్చి మన ఇంటి కప్పు వేసాడు” మమ్మల్ని గమనిస్తూ చెప్పింది.
పిల్లని పండక్కి తీసుకురమ్మని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వచ్చాను.
క్రిస్టమస్ శుభాకాంక్షలు. _/][\_

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...