Tuesday 28 February 2017

ఇంబసైల్

మా (పశ్చిమ ప్రకాశం) ప్రాంతాలలో ఎంతో కొంత మిర్చి పంట ఉంది. 
పది ఎకరాల రైతు బోర్లు ఏండి పోవటం తో పూర్తిగా చేతులెత్తేశాడు. బోర్లు పరిస్తితి బావుంటే చీనీ/నిమ్మ పొలాలు కనీసం మంచి బొబ్బర్లు పండేవి. బోర్లు ఎండిపోయాయి. చుక్క నీరులేదు. విపరితమయిన కరువు. 
డీప్ బోర్లు మూగబోయాయి. పల్లెలు వాడుక నీటికి, పశువుల నీటికి అల్లాడుతున్నాయి. తాగునీటి డబ్బాల వ్యాపారం ఎటూ జనజీవన స్రవంతి లో కలిసి పోయింది. అందరూ వాటికి అలవాటు పడిపోయారు. ఎక్కడయినా పొలాల్లో కొద్దిగా నీరు ఉన్న బోర్లు ఉంటే....వాటిలో ఎవయినా సన్నగా, వచ్చి రానట్టుగా, వస్తూ ఉంటే ఎక్కువ బాగం పంటని వదిలేసి కొద్ది బాగాన్ని కాపాడుకుంటున్నాడు.
సుమారుగా 20 శాతం మించదు అది.
‘పండు మిర్చి’ ధర యదావిదిగా రైతు చేతికి వచ్చే సరికి సగానికి పడిపోయింది.
రోజంతా ఎర్రటి ఎండలో పండు మిర్చి కోసి ఒడ్డుకు చేరిస్తే వచ్చే కూలి మనిషికి 150 రూపాయలు.
దీనికోసం స్థానికంగానే కాక ప్రక్క కరువు మండలాలు (తర్లుపాడు, హనుమంతునిపాడు, దొనకొండ) నుండి కూడా ఆటోల్లో ఆడవాళ్ళు చద్దిమూట కట్టుకుని కిక్కిరిస్నట్టు ప్రయాణం చేసి వస్తుంటారు. సాయంత్రానికి మళ్ళీ అలాగే అలసిన శరీరాల్తో వెళ్తుంటారు. 




మనసు మీద దుప్పటి కప్పితే తప్ప ఈ దారుణం చూస్తూ కన్నీళ్లు పెట్టుకొనుండా ఉండలేము.
కొన్ని రిమోట్ పల్లెల్లో మీరు నమ్మినా నమ్మక పోయినా, ఇళ్ళల్లో ఉండే వాడుక నీరు కన్నా అక్కడ దొరికే, సాఫ్ట్ డ్రింకులు, బీర్లు, చీపు లిక్కరు లో ఎక్కువ ద్రవ ప్రదార్ధం ఉంటుంది.
ఇంత దారుణమయిన పరిస్తితి ఉంటే...
కొన్ని ప్రత్యేక విదులలో భాగంగా పోలీస్, & వీడియొ పర్సనల్స్ తో తిరుగుతూ..
మరికొన్ని విషయాలన్నీ గమనించాను.
మా వెహికల్ వెళ్ళిన చోట యూనిఫార్మ్ లో ఉన్న మా సిబ్బంది ని చూసి..
చెట్ల కింద, గొడ్ల పాకల్లో పేకాట ఆడే వాళ్ళు / తాగి దొర్లేవాళ్లు చాలా మంది తలా ఒక దిక్కు పరిగెత్తడం గమనించాను.
సాయంత్రం పనినుండి వచ్చిన ఆడమనిషి వండి పెడితే పగలంతా ఈ తాగి దొర్లే వాళ్ళు సిగ్గులేకుండా వాళ్ళ రక్తం ఎలా తింటారో అర్ధం కాదు. పల్లెల్లో అందరూ ఇలా ఉండరు.
కానీ యువతరం ఇలాటి ‘ఇంబసైల్’ గా తయారవ్వటం గమనిస్తుంటే చాలా బాధగా ఉంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...