Monday 26 June 2017

వింత గిన్నె

అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండే వాడు.
అతను బీదవాడు. తనకి తండ్రి ఇచ్చిన కొద్ది పాటి పొలం లో పక్కనే ప్రవహించే వాగు నుండి నీరు తెచ్చి కూరగాయలు పండించే వాడు.
అతని బార్య ఆ కూరగాయలు దగ్గర్లో ఉన్న నగరం లో అమ్మి , ఇంటికి కావల్సిన అవసరాలు గడుపుతూ ఉండేది.
ఒక రోజు ఆ రైతు తన పొలం లో చెట్ల పాదులు తవ్వుతూండగా అతని పలుగుకి ఏదో లోహం తగిలి శబ్దం వచ్చింది.
ఆసక్తిగా తవ్విన అతనికి భూమిలో ఎప్పటినుండో ఉండిపోయిన ఒక పెద్ద గిన్నె బయటపడింది.
దాదాపు వందమందికి వంట వండగలిగిన పెద్ద పాత్ర.
రైతు తనకి మరేదయినా విలువయిన వి దొరుకుతాయేమో నని చుట్టూ తోవ్వి చూశాడు. కానీ ఇంకేమీ దొరకలేదు.
అలసి పోయిన రైతు తన పలుగుని ఆ గిన్నె లోకి విసిరి వేసి, ఒక చెట్టు కింద పడుకుని నిద్ర పోయాడు.
కొద్దిసేపటికి అతను నిద్ర లేచే చూసే సరికి ఆ పెద్ద గిన్నెలో వంద పలుగులు కనిపించాయి.
రంగయ్య ఆశ్చర్య పోయాడు.
బార్యని పిలిచాడు. విషయం చెప్పాడు. ఆమె ఆ పలుగులు అన్నీ తీసి వేసి అందులో ఒక మామిడి కాయ ఉంచింది. ఆశ్చర్యం గా అవి వంద కాయలు గా మారి పోయాయి.
రంగయ్య అతని బార్య ఆ గిన్నెని బద్రపరిచారు. మామిడి కాయలు అందరికీ పంచి పెట్టారు.
తమ అవసరాన్ని బట్టి ఆ గిన్నెని వాడుకోవటం తమ అవసరాన్ని మించి ఉన్నవి ప్రజలకి పంచి పెట్టటం జరుగుతూ ఉంది.
త్వరలోనే వారి కుటుంబం అందరికీ సాయం చేయటం గురించి, చుట్టుపక్కల ఉర్ల కి తెలిసి పోయింది.
రంగయ్య తన కి అవసరం అనిపించిన ఆహార పదార్ధాలు మాత్రమే దాని లోనుండి వంద రేట్లు చేసి, తను తినగాగా మిగిలినవి నలుగురికి పంచుతూ వ్యవసాయం చేసుకుంటు ఆనందం గా జీవిస్తున్నాడు.
ఈ విషయం జమిందారి గారి బార్యకి అమ్మలక్కల ద్వారా తెలిసింది. ఆమె జమీందారు ని పోరు పెట్టి ఆ వింత గిన్నె కావాలని పట్టు పట్టింది.
ఆయన ఆ వింత గిన్నెని రంగయ్య వద్ద నుండి బలవంతంగా స్వాదినం చేసుకున్నాడు.
అతని బార్య సంతోష పడింది.
ఆమె వద్ద ఉన్న బంగారాన్ని ఆ గిన్నె లో వేసింది. అది వంద రెట్లు అయ్యింది.
బార్యా బర్తలు ఇద్దరు ఆనందం గా బంగారాన్ని సంచులలో నింపి బద్రం చేశారు.
గిన్నెలో మరో బంగారు నాణెం మిగిలిపోయింది.
దానిని తీసుకోటానికి బార్య గిన్నె లోకి వంగింది.
నాణెం అందుకోటానికి మరింత ముందుకి వంగి జారీ గిన్నె లో పడింది. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...