Thursday 22 September 2016

గాయత్రి మంత్రం

మహాత్మా గాంధీ గారి హత్య జరిగిన రోజుల్లో .. 
ఒక మతి బ్రమించిన వ్యక్తి ‘రమణమహర్షి’ వద్దకు వచ్చి 
“గాందీ ని చంపిన గాడ్సే అందరి కి తెలిసాడు. నేను నిన్ను చంపి కీర్తి సంపాదిస్తాను” అన్నాడు ఉగ్రంగా.
భగవాన్ “చంపు నాయనా. నాకీ దేహ బాద తప్పుతుంది” అన్నాడు శాంతి వదనం తో. 
ఇంతలో ఆశ్రమ వాసులు అతన్ని అటకాయించి, దూరంగా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారు.
భగవాన్ వారించి అతన్ని తనవద్దే ఉంచుకుని తనతో బోజనానికి తీసుకువెళ్లాడు. రెండు రోజులు అతను ఆశ్రమం లో ఉండి పోయాక అతని తాలూకు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు.
జరిగిన విషయం తలుసుకుని “మన్నించండి. అతనికి మనస్థిమితం లేదు. ఏదయినా తరుణో పాయం ఉపదేశించండి " అని వేడుకున్నారు.
“గాయత్రి చేయించండి” అన్నారు భగవాన్. 


కొన్ని నెలల తర్వాత అతను తిరిగి వచ్చాడు. “పరిస్తితి చాలా మెరుగయ్యిందని. సాదారణ జీవితం లోకి తనని గాయత్రి మంత్రం తీసుకువచ్చిందని దన్యవాదాలు చెప్పుకోటానికి వచ్చానని” చెప్పి భగవాన్ ఆశీర్వచనం తీసుకున్నాడు.
(ఈ సంఘటన ‘రమణ వాణి ‘ లో ప్రచురింపబడింది)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...