Friday 12 June 2015

జనాబా పెరిగింది.!!

డోను గుంతకల్లు మద్య మీటర్ గేజ్ రైల్వే ట్రాకు పక్కనే ఉన్న 
ఆంద్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం, డిల్లీ లోని సెన్సెస్ అండ్ పాపులేషన్ అధికారి
ముఖేష్ ఖన్నాదృష్టి ని ఆకర్షించింది. 
ఆ చిన్న గ్రామంలో జనాబా వృద్ది రేటు మిగతా చోట్ల పోలిస్తే ఎక్కువగా ఉంది. 
..
ఇదే విషయాన్ని ఆంధ్రపదేశ్ రాష్ట్రం లోని తమ శాఖకీ రాస్తూ ,
ఒక బృందాన్ని పంపి కారణాలతో ఒక నివేదిక పంపమని నోట్ పంపాడాయన.
..
పరిశోదన బృందం ఆ గ్రామం చేరింది.
అది చాలా చిన్న పల్లె 2011 జనాబా లెక్కల ప్రకారం
నిండా 50 గడప, 186 మంది జనాబా దాటని ఆ గ్రామం
2015 కి 312 మందికి చేరింది.
సుమారు 120 మందికి పైగా శిశువులు.
దాదాపు ప్రతి కుటుంబం లోనూ పసి పిల్లలు ఉండటం గమనించింది ఆ బృందం.
,,
అక్కడి నీరు , గాలి , ఆహారం శాంపిల్లు సేకరించబడ్డాయి.
జీవన విధానం మీద డాక్టరేట్లు చేసిన వాళ్ళు సామాజిక ఇంటర్వ్యూ లు చేశారు.
నెల రోజులు గడిచాయి కానీ జనాబా పెరుగుదల కి
సరైన కారణం మాత్రం కనుగొన లేకపోయారు .
...
డాక్రా మహిళా గ్రూప్ లలో చర్చకి వచ్చింది ఈ వ్యవహారం.
అక్కడా ఏమి తేల లేదు.
గ్రామం లోని ప్రాధమికి పాఠశాల వద్ద ఒక కంప్లయింట్ బాక్స్ ఉంచారు.
కొంత మంది వారికి తోచిన కారణాలు రాసి ఆ పెట్టెలో వేయమన్నారు .
..
రెండో రోజే ఆపెట్టెలో ఒకే ఒక కాగితం ఉంది.
..
“ తెల్లవారు ఝామున పెద్దగా శబ్దం చేసుకుంటూ
అందర్నీ నిద్ర ..'లేపు' కుంటూ
వెళ్ళే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు బండి టైమింగ్స్
మారిస్తే మాత్రం ఒప్పుకునేదే లేదు “ .. ఇట్లు గ్రామ మహిళలు
.grin emoticon tongue emoticon pacman emoticon pacman emoticon
..
ది ఫైల్ ఇస్ క్లోజ్డ్.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...